📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kavitha: తెలంగాణ జాగృతిలో చేరిన కావేటి సమ్మయ్య కుటుంబం

Author Icon By Saritha
Updated: February 16, 2026 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kavitha: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన కార్యక్రమంలో మనోహర్ కుమార్ దంపతులు అధికారికంగా తెలంగాణ (Telangana) జాగృతిలో సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా కవిత వారికి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన కవిత, కావేటి సమ్మయ్య కుటుంబం తెలంగాణ ఉద్యమం పట్ల ఎప్పటికీ నిబద్ధతతో నిలిచిన కుటుంబమని పేర్కొన్నారు. వారి చేరికతో సంస్థకు మరింత బలం చేకూరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Kamareddy Municipality: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ

Kavitha: The family of Kavitha Sammayya who joined the Telangana Jagruti movement

కావేటి మనోహర్, సబిత దంపతుల రాకతో తెలంగాణ జాగృతికి కొమురంభీమ్ జిల్లాలో మరింత బలం చేకూరిందని అన్నారు. జాగృతి సంస్థ చేపట్టే సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలలో వీరు క్రియాశీలక పాత్ర పోషిస్తారని కవిత తెలిపారు.

కావేటి సమ్మయ్య 2007లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, 2011 ఉప ఎన్నికల్లో సమ్మయ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బీఆర్ఎస్‌లోకి తిరిగి వచ్చారు. 2020లో కావేటి సమ్మయ్య మృతి చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BRS Former MLA Kalvakuntla Kavitha Kaveti Manohar Kumar Kaveti Sammayya Latest News in Telugu Telangana Jagruti Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.