📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kavitha Issue : కెసిఆర్ దగ్గర ఉన్న దెయ్యాలేవో కవిత చెప్పాలి – పొంగులేటి డిమాండ్

Author Icon By Sudheer
Updated: May 30, 2025 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో MLC కవిత (Kavitha) వ్యవహారం నానుతూ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలు టీ కప్పులో తుఫాన్‌లా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “కవిత తండ్రి కేసీఆర్ వద్ద దెయ్యాలేవో ఉన్నాయట. అవేంటో ఆమె స్పష్టంగా చెప్పాలి. ఆమె ఎందుకు నోరు విప్పడం లేదు?” అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడిన విషయాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయని తెలిపారు.

BRS – BJP గుట్టు బయటపెడతాం : పొంగులేటి

పొంగులేటి (ponguleti srinivas reddy) వ్యాఖ్యల్లో ప్రధానంగా BRS మరియు BJP మధ్య ఉన్న సంబంధాన్ని ఉద్దేశించారు. “కవిత BRS, BJPల మధ్య సంబంధం ఉందని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాయన్నది ప్రజలకే స్పష్టంగా కనిపిస్తోంది. ఓ BJP ఎమ్మెల్యే కూడా ఇదే విషయాన్ని అంగీకరించారని” మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ మైత్రి అంశం మరోసారి చర్చకు వచ్చి, BRS పార్టీపై ఆరోపణలు మళ్లీ జోరందుకున్నాయి.

భూ కుంభకోణాలపై సీరియస్ చర్యలు

కేవలం వ్యాఖ్యల దాకే కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై కూడా మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. “కాళేశ్వరం విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు. గత ప్రభుత్వంలో భూ బకాసురుల్లా వ్యవహరించిన వారిని బయటకు తీయడం జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణలో భూ వ్యవహారాలపై విచారణలు ఇంకా ఉత్కంఠ రేపే అవకాశం ఉంది.

Read Also : Telangana : బిఆర్ఎస్ పాలనలో రూ. 3.5లక్షల కోట్ల పెట్టుబడులు – KTR

Google News in Telugu kavitha kavitha letter ponguleti srinivas reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.