తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ (Brs) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పార్టీ లోపలే కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు, తనపై సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు మోపుతున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు ఎదురైన అనుభవాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కేసీఆర్పై అపారమైన విశ్వాసం
గతంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను కూడా కవిత ప్రస్తావించారు. లిక్కర్ కేసు వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు తాను పదవికి రాజీనామా చేస్తానని చెప్పగా, కేసీఆర్ వద్దని వారించారని తెలిపారు.కేసీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని కవిత స్పష్టం చేశారు. “కేసీఆర్ (KCR) మాత్రమే నాకు నాయకుడు” అని ఆమె దృఢంగా ప్రకటించారు.
ఫీడ్బ్యాక్ లీక్పై అసహనం
కవిత తీవ్రంగా వ్యాఖ్యానించిన అంశాల్లో ఒకటి ఆమె ఇచ్చిన అంతర్గత ఫీడ్బ్యాక్ లీక్ కావడంపై కేసీఆర్కు నోటీసులు ఇస్తే కూడా నాయకులెవరూ స్పందించకపోతే ఎలా? అని ఆమె ప్రశ్నించారు. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని, వారు తనకు నీతులు చెబుతున్నారని ఆరోపించారు. నా మీద పడి ఏడిస్తే ఎలా? అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని, దాన్ని అరికట్టమని కోరితే, పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తనపైనే విమర్శలు చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? అని ఆమె నిలదీశారు.
ఎంపీగా ఓటమి కుట్రపూరితమే
తన రాజకీయ జీవితం లో భాగంగా జరిగిన ఓటమి వెనుక కూడా పార్టీలోని కొందరి కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. తాను ఎంపీగా పోటీ చేసిన సమయంలో పార్టీలోనే కొందరు కుట్రపూరితంగా తనను ఓడించారని సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలతో పార్టీ అంతర్గత సంఘర్షణలు మళ్లీ పునఃప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది.
బీజేపీలో విలీనం ప్రయత్నాలపై ఆరోపణలు
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారన్నది. తాను జైలులో ఉన్నప్పుడే ఈ విషయాన్ని ఆమె వ్యతిరేకించారని, బీఆర్ఎస్ అనేది ప్రజల పార్టీ అని, దాన్ని ఎవరి ప్రైవేట్ పార్టీగా మార్చకూడదన్న హితవు ఇచ్చారని తెలిపారు. తన రాతపూర్వక లేఖను బయటపెట్టిన వ్యక్తులపై ఆమె తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Kishan Reddy: తెలంగాణ పార్టీ నేతలకు కిషన్ రెడ్డి పలు సూచనలు