Telugu News: Kavitha: బిఆర్ఎస్ తో నాకెలాంటి సంబంధం లేదు

Read Time:  1 min
Kavitha
Kavitha
FONT SIZE
GET APP

ఖమ్మం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) బీఆర్‌ఎస్ పార్టీపై, తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర చేసి తనను పార్టీ నుంచి బయటకు పంపారని, ప్రస్తుతానికి కొత్త పార్టీ ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు.

Read Also: Breaking News – Jagan : రేపు సీబీఐ కోర్టుకు జగన్

Kavitha
Kavitha I have no connection with BRS.

బీఆర్‌ఎస్‌తో బంధం తెగిపోయింది

కవిత ఖమ్మంలో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌తో (BRS) తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కుట్రపూరితంగా తనను, తన కుటుంబాన్ని పార్టీకి దూరం చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని, దీంతో ఆ పార్టీతో తన బంధం తెగిపోయిందని కవిత స్పష్టం చేశారు. భవిష్యత్తులో తామే బాధ్యతాయుత పాత్ర పోషిస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు తనకు, జాగృతి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస గుర్తింపు కూడా లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తుమ్మల నాగేశ్వరరావు లేకపోవడం పెద్ద తప్పు

ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావును (Tummala Nageswara Rao) పార్టీ వదులుకోవడమే బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణమని కవిత అన్నారు. తుమ్మల లాంటి నేతను దూరం చేసుకోవడం నూటికి నూరు శాతం పెద్ద తప్పని అన్నారు. ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అని ఆమె తెలిపారు. అనంతరం జాగృతి కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.