Kavitha CBI Notice : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను అందించేందుకు అధికారులు హైదరాబాద్లోని ఆమె ఇంటికి వెళ్లారు.
హైకోర్టు నోటీసులు
ఇటీవల ఢిల్లీ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులపై నమోదైన అభియోగాలను డిస్మిస్ చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు తమ సమర్పించిన ఆధారాలను సరిగా పరిగణలోకి తీసుకోలేదని సీబీఐ పేర్కొంది.
కవిత ఇంటికి సీబీఐ
ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందించేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్లోని కవిత ఇంటికి వెళ్లారు.
అయితే అధికారులు వెళ్లిన సమయంలో కవిత ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్త అనిల్ ఆ నోటీసులను స్వీకరించారు.
Read Also: LPG Shortage: ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!
కోర్టుకు హాజరు కావాలి
నోటీసుల ప్రకారం ఈ నెల 16వ తేదీన కోర్టుకు (Kavitha CBI Notice) హాజరు కావాలని కవితకు సూచించినట్లు సమాచారం.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నివాసానికి కూడా సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు అందించారు. ఆయన కుమారుడికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రతిస్పందనలు
రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని కవిత, కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తీర్పు తర్వాత కేజ్రీవాల్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై అవినీతి ఆరోపణలు తప్పుడు ప్రచారం అని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: