తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వర్షాకాలంలో రాజకీయ వేడినిపుట్టిస్తున్నాయి. మంగళవారం కవితను బీఆర్ఎస్(kavitha) నుంచి సస్పెండ్ చేయడంతో బుధవారం కవిత ప్రెస్మీట్ ను ఏర్పాటు చేశారు. తన పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని.. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లపై కూడా కుట్రలు జరుగుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీశ్ రావు(Harish Rao), సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్(BRS) ఎస్ పార్టీని జలగల్లా పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీశ్ రూ 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీశ్, సంతోశ్ అంటకాగుతున్నారని దుయ్యబట్టిరు. సంతోష్ రావు బాధితులు చాలామంది తనకు ఫోనుళ్లొ చేస్తూ వారి బాధలను పంచుకుంటున్నారని కవిత అన్నారు.
కేసీఆర్ లేని పార్టీ ఎందుకు? కవిత
బీఆర్ఎస్ ఉంటే ఎంత .. లేకపోతే ఎంత అని తను ఎప్పుడూ అనలేదని కవిత(kavitha) చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని కవిత చెప్పారు. కేసీఆర్ కూతురుగా పుట్టిన తాను ఆయనను, పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ప్రశ్నించారు. ఆరడుగుల బుల్లెట్టే (హరీశ్ రావు) తనను గాయపరిచిందని కవిత మండిపడ్డారు. వీళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు.
వీరివల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఈటలను హరీశ్ దగ్గరుండి గెలిపించారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా కేటీఆర్ గమనించాలని కవిత సూచించారు. ‘పార్టీలో ఏం జరుగుతోంది చూడండి నాన్న.. బీఆర్ఎస్ నేను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి’ అని తన తండ్రిని కేసీఆర్ను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. కవిత నెక్స్ట్ భవిష్యత్తు ఏమిటనే చర్చలు జరుగుతున్నాయి. ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో తన పార్టీ గురించి తెలిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Read hindi news: Hindi.vaartha.com
Read Also: