తెలంగాణ (TG) జాగృతి అధ్యక్షురాలు కవిత తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ (BRS) పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె, తాజాగా చిట్చాట్లో కవిత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కవిత మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషాలు వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు కొన్ని ముహుర్తాలు చేస్తున్నామని 3 నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Read Also: Telangana: ఆస్తి పన్ను, నల్లా బిల్లులపై ప్రభుత్వం స్పష్టత

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ
తెలంగాణ(TG) రాజకీయాల్లో విమర్శలు హద్దు దాటి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయని కవిత పేర్కొన్నారు. జాతిని, నేతలను అవమానించేలా చేసే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని తీవ్ర విమర్శలు గుప్పించారు. (TG) తెలంగాణ చరిత్రలో కేసీఆర్కు అంటూ ఒక పుస్తకమే ఉంటుందని అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదని కవిత తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు.
కవిత బీసీ హక్కులపై రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిన గత రెండు బడ్జెట్లలో బీసీలకు ఇచ్చిన హామీ పూర్తిగా అమలు కాలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వార్షిక రూ.20 వేల కోట్ల హామీ ఇంకా నెరవేరలేదని, బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం కావాలని డిమాండ్ చేశారు. కవిత ఫోన్ ట్యాపింగ్ కేసులో చిన్న చేపలకు మాత్రమే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. పెద్ద చేపలను వదిలేస్తున్నారని, కేసును టీవీ సీరియల్లా సాగిస్తున్నట్లు మండిపడ్డారు.
(TG)తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఆ ఆత్మగౌరవ సభ లక్ష్యమని కవిత వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: