📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Kavitha : కవిత ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో సంచలనం

Author Icon By Sudheer
Updated: August 3, 2025 • 3:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నల్గొండ జిల్లాలో ఓ నాయకుడు బీఆర్‌ఎస్‌ను నాశనం చేశారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు ఎవరి వైపు ఉంటాయో అనే చర్చ సాగుతోంది. “నల్గొండలో ఓడిపోవడానికి కారణమైన నేతలు ఉన్నారు. ఒకరు గెలిచి మిగతా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించారు” అని కవిత పేర్కొన్నది రాజకీయంగా దుమారం రేపుతోంది.

లక్ష్యం జగదీశ్ ?

నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచింది జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) ఒక్కరే. అంతకుముందు కవితపై జగదీశ్ రెడ్డి చేసిన విమర్శలు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కవిత చేసిన ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు జగదీశ్ రెడ్డినే టార్గెట్ చేస్తూ చేసినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగదీశ్ రెడ్డి నల్గొండలో తన స్వార్థం కోసం పార్టీలో విభజనలు సృష్టించి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఈ వ్యాఖ్యల తీవ్రత మరింత పెరిగింది.

బీఆర్‌ఎస్ లో ఇంటర్నల్ వార్?

కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ లోని అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కేసీఆర్ పార్టీ నేతలకు వ్యాఖ్యలపై స్పందించవద్దని చెప్పినా, కవిత-జగదీశ్ రెడ్డి మధ్య విమర్శల తాకిడి కొనసాగుతుండటం గులాబీ పార్టీలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. నల్గొండ జిల్లాలోని నేతల మధ్య నడుస్తున్న ఈ అంతర్గత సంఘర్షణ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ లో మళ్లీ గ్రూప్ రాజకీయాలను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.

Read Also : Sircilla: అగ్గిపెట్టెలో పట్టే ఆపరేషన్‌ సింధూర్‌ శాలువా తయారు చేసిన సిరిసిల్ల నేతన్న

Google News in Telugu jagadeesh reddy mlc kavitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.