📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Karimnagar: పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు. వారికోసం రాత్రీపగలు కష్టపడతారు. వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తారు. సమాజానికి ఆదర్శంగా జీవించాలని తపిస్తారు. చదువుకునేందుకు అన్ని సదుపాయాలను కల్పిస్తారు. అసలు వారికి కష్టం అనేది తెలియకుండా పెంచేందుకు యత్నిస్తారు. అలాంటి పిల్లలు ఎదిగిన తర్వాత తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తే ఆ తల్లిదండ్రుల మనసు సమ్మతించదు. తాజాగా ఓ బాలిక పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని, స్వయంగా అమ్మానాన్నలే తమ కూతురుని హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Read also: UP Crime: భార్యపై అనుమానంతో భర్త హత్య, మృతదేహం ఇంట్లో దాచిన ఘటన

Karimnagar crime

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం…శివరాంపల్లికి చెందిన ఓ దంపతుల చిన్న కూతురు (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ వయసులో కెరీర్ను పదునుపెట్టుకోవాల్సిన వయసులో ప్రేమవైపు ఆ బాలిక మనసు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన పెళ్లైన ఓ యువకుడితో బాలిక ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నది. దీంతో తల్లిదండ్రులు బాలికను పద్ధతి మార్చుకొమ్మని హెచ్చరించారు.

మాట వినకపోవడంతోనే హత్య

అయితే బాలిక తన తల్లిదండ్రుల మాటలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. దీంతో విసుగు చెందిన అమ్మానాన్నలు తమ కూతురుని హతమార్చారు. నవంబరు 14వ తేదీన బాలిక నిద్రిస్తున్న సమయంలో పురుగుమందును (pristicide) తమ కుమార్తెకు బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించారు. అంతేకాగా తండ్రి బాలిక గొంతు నులిమి హతమార్చారు. ఇందుకు తల్లి కూడా సహకరించింది. ఉదయం ఏమీ ఎరుగనట్లుగా బాలిక తండ్రి రాజు తమ కుమార్తె పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో బాలిక గొంతు నులమడంతోనే మరణించినట్లు తేలింది. యువకుడితో కూతురు ప్రేమను గిట్టని తల్లిదండ్రులే దారుణానికి ఒడిగట్టారు. ఇది పరువు హత్య అని ఏసీపీ స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో తామే కూతురుని చంపినట్లుగా అంగీకరించినట్లు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CrimeNews HonorKilling latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.