Kalvakuntla Kavitha: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (TTD) వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు. ఆమె అంతకు ముందు గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేను నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనో వేదన స్వామి వారి దయతో తీరిపోయింది సత్యం, న్యాయం, ధర్మం మావైపు ఉందని నేను చెప్తూ వచ్చాను.. స్వామి వారి దయతో కంప్లీట్ గా క్లీన్ చిట్ వచ్చింది.. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాను.
Read Also: Telangana: తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా
నూతన పార్టీ దిశగా అడుగులు
తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నాను తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకున్నాను. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నాను.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: