హైదరాబాద్ : రంగనాయక సాగర్లో ఉన్న నీళ్లు కాళేశ్వరం బ్యారేజీ(Kaleshwaram project)ల నుంచి ఎత్తిపోసినవే అని నిరూపిస్తావా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Ailaiah) సవాల్ చేశారు. సిఎల్పి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ హరీష్ రావు సిఎం ను రంగనాయక్ సాగర్ వేస్తాను మునిగితే కాళేశ్వరం ఉన్నట్లు మునగపోతే లేన్నట్లు అని అనడం నీస్థాయికి తగదని ధ్వజమెత్తారు. అందుకే మా ముఖ్యమంత్రి హరీష్ రావును ఆరడుగులు పెరిగావు కాని చటాక్ ధమాక్ లేదని ఎత్తిచూపుతారని ఎద్దేవా చేశారు.
Read Also: Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ

కాళేశ్వరం నీళ్ల వివాదం
తెలంగాణ ప్రజలు రెండేళ్ల క్రితమే నీకు, నీ మామకు, నీ బామ్మర్ది కి బండ కట్టి కాళేశ్వరంలో వేశారని అపహాస్యం చేశారు. మీరేప్పుడో కూలిన కాళేశ్వరంలో మునిగిపోయారని విమర్శించారు. మీ పార్టీ కూడా అప్పుడే కాళేశ్వరంలో సమాధి అయిపోయిందనీ కాళేశ్వరం(Kaleshwaram project) పాపం మమ్మల్ని గోదావరి లో కలిపేసిందనీ అన్నారు. నీ పిల్లల మీద ఓట్టేసి చెప్పు మేడిగడ్డ కు వర్రెలు పాయలేదా..? అని ప్రశ్నించారు. అన్నారం సిపేజిలో రాలేదా..? కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు రెండేళ్ల నుంచి చుక్కనీళైనా ఎత్తిపోశారా? అని ఆయన 205 నిలదీశారు.
బీఆర్ఎస్ పత్తా లేదంటూ ఐలయ్య ఎద్దేవా
జనం ఛీ కొట్టినా ఇంకా హరీష్ రావు కు ఏ మాత్రం సిగ్గు రావడం లేదని చీత్కరించారు. జూబ్లీహిల్స్ లో బండకేసి బాదినా బుద్దిరావడం లేదని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ పత్తా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అనేక గ్రామాల్లో పోటీ మా పార్టీ అభ్యర్థుల మధ్యే ఉంది తప్ప బిఆర్ఎస్ ఎక్కడా కనిపించడం లేదని అన్నారు నాలుగు రోజులు ఆగు రాష్ట్రంలో నీ జెండా కూడా కనిపించదని చెప్పారు. మా ముఖ్యమంత్రి పైన నోరుపారేసుకుంటే నీకు తగిన శాస్త్రి చేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: