📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Kaghaznagar: నవంబర్‌లో పులుల దాడులు: ఉమ్మడి ఆదిలాబాద్‌ వణుకు

Author Icon By Radha
Updated: November 18, 2025 • 8:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉమ్మడి ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాలోని కాగజ్‌నగర్‌(Kaghaznagar) కారిడార్‌ ప్రాంతంలో ప్రతీ నవంబర్‌ మాసంలోనూ పెరుగుతున్న మానవ-వన్యప్రాణి సంఘర్షణ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నవంబర్‌ నెల వచ్చిందంటే చాలు పులులు, చిరుతలు, చివరికి ఏనుగుల దాడుల కారణంగా విషాద వార్తలు వినాల్సి వస్తుందనే భయంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు వణికిపోతున్నారు. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి వలస వచ్చే పెద్ద పులులకు, దట్టమైన అరణ్యాలున్న కొమురంభీం (K.B.) ఆసిఫాబాద్‌ జిల్లా అడవులు అనువైన ప్రాంతంగా మారాయి. తడోబాలో పులుల సంఖ్య పెరగడంతో, కొత్త ఆవాసం, తోడు కోసం సరిహద్దులు దాటుతున్న పులులు కాగజ్‌నగర్‌(Kaghaznagar) కారిడార్‌ గుండా ప్రయాణిస్తున్నాయి.

Read also: Fire Accident : మహబూబ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం..ఇద్దరు మృతి

పత్తి పంట చేతికొచ్చే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలోనే అడవి శివార్లలోని పంట చేలల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులపై దాడులు జరుగుతున్నాయి. పెంచికల్‌పేట, బెజ్జూర్‌ ప్రాంతాల వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. 2020 నుంచి ప్రతీ నవంబర్‌లో మనుషులపై దాడులు జరుగుతున్న సంఘటనలు ఈ ప్రాంతంలో భయాందోళనను పెంచుతున్నాయి. 2020 నవంబర్ 11న దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్, నవంబర్ 29న కొండపల్లికి చెందిన నిర్మల పులి దాడిలో మరణించారు. 2024 నవంబర్ 29న గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కూడా ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయింది. అలాగే, 2024 ఏప్రిల్‌లో దారి తప్పి వచ్చిన ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మరణించడం ఈ భయాన్ని మరింత పెంచింది.

అటవీ అధికారుల సూచనలు: దాడులను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మానవ ప్రాణ నష్టాన్ని నివారించడానికి, అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా రైతులు, కూలీలకు పలు కీలక సూచనలు జారీ చేశారు:

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా అడవి జంతువుల దాడుల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవచ్చునని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

asifabad Human-Wildlife Conflict Kaghaznagar latest news Tiger Attacks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.