News Telugu: Kadiyam Srihari: అసెంబ్లీలో స్పీకర్‌తో భేటీ అయిన కడియం శ్రీహరి

Read Time:  1 min
Kadiyam Srihari meets the Speaker in the Assembly
Kadiyam Srihari meets the Speaker in the Assembly
FONT SIZE
GET APP

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను (Gaddam prasad kumar) కలసి ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడానికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది ఇప్పటికే తమ అఫిడవిట్లను అసెంబ్లీ కార్యాలయానికి అందజేశారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Read also: Corruption: అభివృద్ధికి తూట్లు పొడుస్తున్న అవినీతి

Kadiyam Srihari meets the Speaker in the Assembly

Kadiyam Srihari meets the Speaker in the Assembly

ఈ నెల 23వ తేదీలోగా

ఈ నేపథ్యంలో స్పీకర్ మరోసారి వీరికి నోటీసులు పంపి ఈ నెల 23వ తేదీలోగా అఫిడవిట్ రూపంలో తమ వివరణను సమర్పించాలని సూచించారు. తాజా పరిణామాల్లో భాగంగా కడియం శ్రీహరి స్పీకర్‌ను స్వయంగా కలిసి మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న దానం నాగేందర్ రాష్ట్రానికి చేరుకున్న తరువాత స్పీకర్‌ను కలిసి గడువు పొడిగింపును కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.