📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి

Author Icon By Sukanya
Updated: February 9, 2025 • 7:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. గతేడాది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, “ఉపఎన్నికలు వస్తే నేను పారిపోను, పోరాటంలో కొనసాగుతాను” అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వేసిన పిటిషన్లపై తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, తాను కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి గత వారం అనర్హత పిటిషన్లపై 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పి. కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఫిబ్రవరి 10న తదుపరి విచారణ జరగనుంది. బీఆర్‌ఎస్ అధికారం ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని శ్రీహరి ఆరోపించారు. “తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని” ఆయన విమర్శించారు. దళితులకు 18% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సమర్థిస్తున్నారని ఆరోపించారు.

1980ల్లో టీడీపీ నుంచి కడియం శ్రీహరి రాజకీయ ప్రయాణం ప్రారంభం అయింది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో మంత్రి గ పనిచేసారు. 2013లో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్)లో చేరారు. 2014లో వరంగల్ లోక్‌సభకు ఎంపిక అయ్యారు, 2015లో తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 2023లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది మార్చిలో కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం, బీఆర్‌ఎస్ ఫిరాయింపుదారులపై కేసు విచారణలో ఉండగా, “న్యాయ పోరాటానికి సిద్ధం” అని శ్రీహరి స్పష్టం చేశారు.

brs congress Google news Kadiyam Srihari Kaushik Reddy KCR Telangana Telangana assembly

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.