చేర్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన తన భార్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో రుజువు కావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. రమేశ్ను (K.Ramesh) ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, పోలీసు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు సీపీ సాధన రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు.
Read Also: Telangana: 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా బంద్!

రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వైనం
ఈ ఘటనపై రమేశ్ (K.Ramesh) భార్య, చేర్యాల 2వ వార్డు బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి కమలాపురం గీతాంజలి, నిరసనకు దిగారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన ఆమె అక్కడే కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గీతాంజలి పేర్కొన్నారు, తన భర్తను సస్పెండ్ చేయడం ప్రత్యర్థి భయంతో, అధికార బలాన్ని ఉపయోగించి తీసుకున్న నిర్ణయం అని. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నో ప్రలోభాలు చూపించి పోటీ నుండి తప్పించడానికి ప్రయత్నించారని, అంగీకరించకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డారన్నారు అని ఆమె విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: