హైదరాబాద్: పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయి దృష్టి ఆకర్షించాలనేది ప్రభుత్వ లక్ష్యమని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ. 15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. సోమవారం ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి ఆయన మాట్లాడారు.
దేశంలోనే తెలంగాణ అత్యంత గమ్యస్థానంగా మార్చధాం
దేశంలోనే తెలంగాణ (Telangana) ను అత్యంత ఇష్టపడే గమ్యస్థానంగా మార్చడమే ప్రధాన లక్ష్యమన్నారు. కనీసం మూడేళ్లలో మూడు లక్షల మందికి అదనంగా ఉపాధికల్పిస్తామని, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని దేశంలో ఐదు స్థానాల్లో ఒకటిగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మన పండుగల విశిష్టత, సంసృ్కృతి అంతర్జాతీయంగా ప్రతిభింబించేవిధంగా ప్రత్యేక కార్యాచరణలతో ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ఆదాయంలో 10 శాతం, అంతకంటే ఎక్కువ టూరిజం నుంచి వచ్చేవిధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బ్రెజిల్లో ఏటా ఘనంగా ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జూపల్లి కృష్ణారావు నిర్వహించే రియో కార్నివాల్ (Rio Carnival) తరహా కార్యక్రమాలను రాష్ట్రంలో చేపట్టనున్నామని వివరించారు. ప్రకృతిని గొప్పగా ఆరాధించే ఉత్సవం బతుకమ్మ అని, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన పండుగను పెద్దఎత్తున కార్య క్రమాల కోసం ప్రణాళికలు రూపొందించామన్నారు. 9 రోజుల పాటు 9 వేడుకలు వైభవంగా కొన సాగుతాయి.
సెప్టెంబరు 21 నుంచి సెప్టెంబరు 30 వరకు ఉత్సాహలు ఆధ్యాత్మికతతో సందడి నెలకొననుంది. సెప్టెంబరు 21న వరంగల్లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది. 22 నుండి 24 వరకు, ప్రతి రోజు 34 జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై 27న బతుకమ్మ కార్నివల్ ఉండగా 28న ఎల్బీ స్టేడియంలో గిన్ని 5 వరల్డ్ రికార్డు ລ້, 10,000 కంటే ఎక్కువ మంది మహిళలతో గరిష్ట సమూ హం, 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతు కమ్మ పోటీ కార్యక్రమం, సెప్టెంబరు 29న ఐటి రంగం ఉద్యోగులు ఆర్ డబ్ల్యూఏల పోటీలు, 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోళి ఉంటాయన్నారు. అదేవిధంగా 28న బతుకమ్మ సైకిల్ రైడ్, 29నమహిళల బైకర్స్ రైడ్, 30న విన్టేజ్ కార్ ర్యాలీతో పాటు నాలుగు రోజులు మాధాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతు కమ్మ థీమ్తో ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పా రు. ఇక పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమం, బతుకమ్మ ఆకారంలో అలంకరించిన ఫ్లోట్స్ ఉంటా యని కృష్ణారావు వివరించారు. వెల్కమ్ డ్యాన్సులు ఢిల్లీ, ముంబై నుండి హైదరాబాద్కు వచ్చే అన్ని విమానాలలో ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: