📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

కేసీఆర్‌, హరీశ్‌రావు పిటిషన్‌ పై తీర్పు రిజర్వు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 24, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు

హైదరాబాద్‌: హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌ , మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలను ముగించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

జిల్లా కోర్టుకు పరిధి లేకుండా ఉత్తర్వులు

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరిస్తూ జిల్లా కోర్టు కేసీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జిల్లా కోర్టుకు పరిధి లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందంటూ వారిద్దరూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తీర్పు రిజర్వు

ఇటీవల ఫిర్యాదుదారు రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. ఫిర్యాదుదారు మృతి చెందితే పిటిషన్‌కు విచారణార్హత ఏ విధంగా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతిచెందినా పిటిషన్‌ను విచారించవచ్చని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కోర్టు పరిధిలేకుండా ఉత్తర్వులు జారీ చేసిందని కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.

Breaking News in Telugu Google news Google News in Telugu harish rao KCR Latest News in Telugu petition Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.