బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Jubilee Hills Results) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మంగళం పాడేశారని, ఈ విషయాన్ని బీహార్ ఎన్నికల ఫలితాలు సుస్పష్టం చేశాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకత్వంపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టారు.
Read also: ఆలుబుఖర్ ఫలాలతో ఆరోగ్య రహస్యాలు!
ఎలక్టోరల్ ప్రాసెస్ విశ్వసనీయతపై వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎస్ఐఆర్ వ్యవస్థపై అనగా ఎలక్టోరల్ ప్రాసెస్ ఎన్నికల విధానం మరియు ఈవీఎంల పై చేస్తున్న ఆరోపణలను దేశ ప్రజలు పూర్తిగా తోసిపుచ్చారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రజా తీర్పు(Jubilee Hills Results) ద్వారా ఇది రుజువైందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఎన్నికల సంఘం (ECI) విశ్వసనీయతను ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ పవిత్రమైందని, దాన్ని అప్రతిష్ఠ పాల్జేసేలా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ గెలుపుపై కాంగ్రెస్ను నిలదీసిన కిషన్రెడ్డి
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై కూడా కిషన్రెడ్డి స్పందించారు. బీజేపీ చరిత్రలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నడూ గెలవలేదని, కానీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులతో గెలుపొందిందని ఆయన విమర్శించారు. ఒకవైపు ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా లేదని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ గెలిచిన ‘జూబ్లీహిల్స్’ ఫలితంపై మాత్రం సమాధానం చెప్పాలని కిషన్రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు సక్రమంగా ఉన్నాయా, లేక అప్పుడు కూడా తప్పు జరిగిందా అనే విషయంపై రాహుల్ స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను రుజువు చేస్తుందని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: