తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం నియోజకవర్గం ఉత్సాహభరిత వాతావరణంలో ఉంది. సాధారణ ఓటర్లతో పాటు సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Read also: Jubilee Hills By-Election: మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
సినీ తారల ఓటు హక్కు వినియోగం
జూబ్లీహిల్స్ పరిధిలో (Jubilee Hills By-Election) పలు సినీ ప్రముఖుల నివాసాలు ఉన్నందున ఈ ఉప ఎన్నికపై సినిమా వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, కామెడీ నటుడు అలీ, యాంకర్ సుమ కనకాల మధురానగర్, షేక్పేట్ ప్రాంతాల్లో తమ ఓటు వేయనున్నారు.
సినీ కార్మికుల ఓట్లు అధికంగా ఉండటంతో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్స్ రద్దు చేసి, వారికి సెలవు ఇచ్చింది. చిరంజీవి, చెర్రీ, బన్నీ నివాసాలు జూబ్లీ పరిధిలోనే ఉన్నా.. వారి నియోజకవర్గం మాత్రం ఖైరతాబాద్ కిందికి వస్తాయి. దీంతో వారు ఓటు వేయలేరు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి పార్టీ తమ అభ్యర్థి విజయం కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తోంది. సీనియర్ నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించడమే కాకుండా ప్రజలను కూడా ఓటు వేయమని ప్రోత్సహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :