తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) కు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పోలీస్ విభాగం, ఈ ప్రక్రియను శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను తీసుకున్నారు.
AP: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం?
ఈ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ల కేంద్రంగా ఉన్న షేక్పేట తహసీల్దార్ కార్యాలయం (Sheikhpet Tahsildar’s Office) పరిసరాల్లో 144 సెక్షన్ (Section 144) విధిస్తున్నట్లు ప్రకటించారు.ఉప ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ర్యాలీలుగా వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఎన్నికల కార్యాలయం వద్దకు వాహనాలను పూర్తిగా నిషేధించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు కేవలం నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించనున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే 18 మార్గాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు (Checkpoints) ఏర్పాటు చేసి నిఘా పెంచారు.మరోవైపు, ప్రధాన రాజకీయ పార్టీలు (Political parties) ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి.
నామినేషన్లు వేయడానికి పది రోజుల సమయం
అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత (Maganti Sunitha) పేరును ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ (Naveen Kumar) బరిలో నిలవనున్నారు. బీజేపీ అభ్యర్థి (BJP candidate) ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నామినేషన్లు వేయడానికి పది రోజుల సమయం ఉండటంతో, అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు.పశ్చిమ మండలం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
అడిషనల్ డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 9 మంది ఎస్ఐలతో పాటు 59 మంది సిబ్బంది, బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఈ భద్రతా వలయం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: