జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ మొదలుపెట్టారు. లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు.నిబంధనల ప్రకారం, అధికారులు మొదటగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు.
Read Also: Jubilee Hills By Election: మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్

కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం
ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 39 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి 10 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు (Jubilee Hills By Election) ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 3 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. తొలి రౌండ్ లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ కు 62 ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్ కు 9,826 ఓట్లు, బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి.తుది ఫలితం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: