జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితాల కౌంటింగ్కు వేదిక సిద్ధమైంది. నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.అధికార పార్టీ, ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులందరూ తమ తమ స్థాయిలో విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pensions: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్తో పెన్షనర్లకు సౌకర్యం: శ్రీధర్ బాబు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో (Jubilee Hills By-Election) మొత్తం 48.49% పోలింగ్ రికార్డు అయ్యింది. మొత్తం 4,01,365 రిజిస్టర్ అయ్యిన ఓటర్లలో 1,94,631 మంది ఓటు వేసారు.
నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో ఓటింగ్ ఇలా..
- బోరబండ: 53,211 ఓట్లలో 29,760 (55.92%)
- రహమత్ నగర్: 74,387 ఓట్లలో 40,610 (54.59%)
- ఎర్రగడ్డ: 58,752 ఓట్లలో 29,112 (49.55%)
- సోమాజీగూడ: 34,653 ఓట్లలో 14,553 (41.99%)
- యూసఫ్ గూడ్: 55,705 ఓట్లలో 24,219 (43.47%)
- షేక్ పేట్: 71,062 ఓట్లలో 31,182 (43.87%)
- వెంగళ్ రావు నగర్: 53,595 ఓట్లలో 25,195 (47.00%)
కౌంటింగ్ యూసఫ్ గూడ్ లోని కొట్ల విజయం భాస్కర్ రెడ్డి స్టేడియంలో 42 కౌంటింగ్ టేబుల్లతో, 10 రౌండ్లలో జరుగుతుంది. లెక్కింపు షేక్ పేట్ డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డ డివిజన్ వద్ద ముగుస్తుంది.
ఈ క్రమంలో, అన్ని రకాల పబ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, వైన్స్ నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేయనున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్, టపాకాయలు పేల్చడం కూడా 24 గంటలపాటు నిషేధం.
ఎన్నికల సిబ్బంది మాత్రమే ప్రవేశించగలరు
ఇలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు (EVMs) స్టేడియం స్ట్రాంగ్ రూమ్లలో భద్రతా పరంగా సురక్షితంగా ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్, జనరల్ ఆబ్జర్వర్ రంజిత్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో పోలింగ్ స్టేషన్ల నుండి స్టేడియం రిసెప్షన్ సెంటర్కు బదిలీ చేశారు. ఆ ప్రదేశంలోకి కేవలం అధికారికులు, ఎన్నికల సిబ్బంది మాత్రమే ప్రవేశించగలరు.
ఈ ఉపఎన్నికలో మొత్తం ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నా, వివిధ డివిజన్లలో వివిధ రకంగా ఓటింగ్ నమోదైంది. బోరబండలో అత్యధికంగా, సోమాజీగూడలో అత్యల్పంగా ఓట్లు నమోదయ్యాయి. కౌంటింగ్ ఫలితాలు రేపు తేలనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: