జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి షాక్
జూబ్లీహిల్స్(Jubilee hills by election) ఉపఎన్నిక వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఊహించని షాక్ తగిలింది. ఆమెతో పాటు కుమార్తె మాగంటి అక్షరపై కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు చేసింది.
Read also: పైకి ఫుడ్ టిన్లు.. లోపల చూస్తే అవ్వాక్కే
మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా మాగంటి సునీతను A1గా, ఆమె కుమార్తె అక్షరను A2గా నమోదు చేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ (BRS) నాయకులు రాజ్కుమార్ పటేల్, అంజద్ అలీఖాన్, ఆజం అలీ, షఫీ, ఫయీం తదితరులపై కూడా కేసులు నమోదయ్యాయి. మతపరమైన ప్రదేశంలో రాజకీయ ప్రచారం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ చర్యలు, దర్యాప్తు ప్రారంభం
శుక్రవారం జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం విచారణ చేపట్టింది. మసీదు వద్ద బీఆర్ఎస్ నాయకులు కండువాలు ధరించి చేతిలో కరపత్రాలతో కనిపించారని, ఇది ఎన్నికల (Jubilee hills by election) నియమావళి ఉల్లంఘనగా తేలిందని అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: