హైదరాబాద్: పెరుగుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భూ తాపాన్ని తగ్గించేందుకు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) పిలుపునిచ్చారు.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ, ఈఈఎస్ఎల్ సీనియర్ అధికారులు హైదరాబాద్లో శక్రవారం గవర్నర్ను కలిసి ఇందన సామర్థ్య రంగంలో కీలక పరిణామాలపై వివరించారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రీన్ హౌస్ (Green house) వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అడవుల పెంపకానికి చర్యలు
ఈ విధానం ఆర్ధిక, పర్యావరణంతోపాటు సమాజానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని నొక్కి చెప్పారు. వాతావరణ చర్యలపై ప్రపంచ సమాజాన్ని ఏకం చేసే దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయత్నాలకు సహకరించాలన్నారు. ఇందులో భాగంగా పలు కీలక రంగాలలో సమన్వయంతో కూడిన ప్రయత్నాల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అన్ని విభాగాల ప్రత్యక్ష ప్రమేయం పునరుత్పాదక విద్యుత్న (Renewable electricity) ప్రోత్సహించడం, ఇంధన సామర్థ్య చర్యలను వేగవంతం చేయడంలో విద్యుత్, రవాణా, భవనాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు మరియు చిన్న మరియు మధ్య తరహా సంస్థలు సహా అన్ని సంబంధిత విభాగాల ప్రమేయం అవసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడంలో ఇంధన సామర్థం మాత్రమే 40 శాతం కంటే ఎక్కువ దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రంగంలో ప్రపంచ ఉత్తమ పద్ధతులతోపాటు క్లీన్ టెక్నాలజీలను అమలు చేయడంలో పూర్తిస్థాయి మద్దతు ఇచ్చినందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ ఎల్), పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ
శాఖల సమిష్టి ప్రయత్నాలు చేస్తున్నాయని సోలార్ ఎనర్జీని వినియోగించడంలో మహిళలను భాగస్వామ్యం చేయడానికి ప్రస్తావించారు .
తెలంగాణ కొత్త గవర్నర్ ఎవరు?
తెలంగాణ కొత్త గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు. ఆయన 31 జూలై 2024 నుంచి అధికారంలో వచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Ponguleti Srinivasa Reddy: ప్రతి మండలానికి 46 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లు : మంత్రి పొంగులేటి