📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం

Author Icon By Sudheer
Updated: February 2, 2025 • 10:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా, తెలంగాణకు అన్యాయం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేంద్ర బడ్జెట్‌పై ఘాటుగా స్పందిస్తూ, ఇది భారత దేశ బడ్జెట్టా, బీహార్ బడ్జెట్టా? అని ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్రంలో మంత్రి పదవిని ఆక్రమించిన కిషన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి బాధ్యతలేదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో రోజులుగా మెట్రో రైలు విస్తరణ కోసం ఎదురుచూస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా, తాజా బడ్జెట్‌లో దానికి సంబంధించిన నిధులు కేటాయించకపోవడం తెలంగాణ రైతులను మోసం చేసినట్టేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పసుపు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వారిని పట్టించుకునే నాధుడు కేంద్రంలో లేడని విమర్శించారు.

ప్రధానంగా, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రావాల్సిన వాటిని పూర్తిగా దూరం పెట్టి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించడం స్పష్టమైన రాజకీయ కుతంత్రమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రజలు బీజేపీ నిజస్వరూపాన్ని గుర్తించి, భవిష్యత్‌లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి సూచించారు.

సమగ్ర అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకునే బీజేపీ, తెలంగాణను విస్మరించడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రంలో నిరసనలు పెరుగుతున్నాయని, తగిన విధంగా ప్రజలు భవిష్యత్తులో తీర్పు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Budget Jeevan Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.