జనగామ (Jangaon) జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన దుబ్బ తండా (Dubba thanda) గిరిజన గ్రామంలో గత 15 రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక, బోర్లు బాగా దిగక గ్రామస్థులు బావులు, చెరువుల వద్దకు నడుచుకుంటూ వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల్లో ఆగ్రహం
ఈ సమస్యపై పలు మార్లు గ్రామ ప్రజలు అధికారులను సంప్రదించినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గిరిజనులు (tribes) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. “మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. మా బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా
తాజాగా గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, వెంటనే తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. అధికారులు స్పందించి తాగునీరు అందించకుంటే, కలెక్టరేట్ వద్ద ధర్నాకు కూర్చుంటామని గిరిజనులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana: భార్య పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్ తో సహజీవనం