Jangaon Road Accident: జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జనగామ పట్టణంలోని ఫ్లైఓవర్పై వేగంగా వస్తున్న బొలెరో వాహనం, బైక్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ భీకర ప్రమాదంలో ఒక యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

ఘటన వివరాలు
స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నవీన్, జనగామ మండలం శామీర్పేటకు చెందిన అభిలాష్ కలిసి బైక్పై వెళ్తుండగా ఫ్లైఓవర్పై ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో, నవీన్కు తీవ్ర రక్తస్రావమై ఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న అభిలాష్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: