Jagtial: పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్

Read Time:  1 min
Jagtial
Jagtial
FONT SIZE
GET APP

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై మరో ఎమ్మెల్యేకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు. జగిత్యాల(Jagtial) ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని నిర్ధారించే సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు స్పష్టమైన తీర్పును వెలువరించారు. ఈ అంశంపై గత కొంతకాలంగా విచారణ కొనసాగింది. ఇరు పక్షాల వాదనలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం సంజయ్ పార్టీ మారినట్లు నిరూపించే సాక్ష్యాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేశారు.

Read Also:Choppadandi Elections: BRS టిక్కెట్ ఇవ్వలేదని ఓ జంట వినూత్న నిరసన

Jagtial

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్

సంజయ్‌పై(Jagtial) అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్‌కు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై జరిగిన విచారణలో ఆరోపణలకు బలమైన ఆధారాలు లభించలేదని స్పీకర్ తన నిర్ణయంలో పేర్కొన్నారు. ఇదే తరహాలో గతంలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ ఇదే విధమైన తీర్పులు ఇచ్చారు. పార్టీ మారినట్లు నిర్ధారించే ఆధారాలు లేనందున వారిపై అనర్హత చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని అప్పట్లో స్పష్టం చేశారు.

ఇద్దరు ఎమ్మెల్యేల కేసులు ఇంకా పెండింగ్

ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరికి సంబంధించిన కేసులు ప్రస్తుతం స్పీకర్ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై విచారణ పూర్తవడంతో తగిన ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పి ఆయనకు క్లీన్ చీట్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.