జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాలకు కుటుంబంతో వచ్చిన 11 ఏళ్ల బాలిక విద్యుత్ షాక్కు (current shock) గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, వైద్యులు ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఉత్సవాల్లో నృత్యం చేస్తూ ఆనందంగా ఉన్న చిన్నారి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Read also: AP: కైకలూరును కృష్ణా జిల్లాలో విలీనం చేయాలి: సిఎంకు గ్రామస్తులు వినతి
Girl dies during Brahmotsavam, tension in front of the temple!
అనుకోకుండా బాలిక మెడకు తగలడంతో
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని లైటింగ్ అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అయితే మెట్ల వద్ద అమర్చిన ఒక లైటింగ్ వైర్ అనుకోకుండా బాలిక మెడకు తగలడంతో ఆమెకు బలమైన విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనతో అక్కడున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలిక మృతితో బాధిత కుటుంబం ఆలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. విద్యుత్ అలంకరణలో నిర్లక్ష్యం జరిగిన కాంట్రాక్టర్తో పాటు ఆలయ కమిటీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పండుగలా సాగాల్సిన బ్రహ్మోత్సవాలు ఒక్కసారిగా విషాదంగా మారడంతో గ్రామం మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: