📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Jaggareddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బిఆర్ఎస్ నేతలు

Author Icon By Saritha
Updated: January 5, 2026 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రోళ్ల దోపిడీ గుర్తుకు రాలేదా?

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నీళ్ల దోపిడి చేస్తుందంటూ మళ్లీ తెలంగాణ (Jaggareddy) సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ (BRS) పార్టీ అగ్రనేతలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆదివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తూర్పు జగ్గారెడ్డి మాట్లాడుతూ నీళ్ల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాతే తెలంగాణకు నీళ్లు వచ్చినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాదారంటూ వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం వల్లే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నారని ప్రచారం చేశారని బీఆర్ఎస్ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పాలనలో అసలు ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు మాట్లాదారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని న్నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇక సింగూరు, మంజీరా డ్యామ్లు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని వివరించారు.

Read also: TG: సమ్మక్క, సారలమ్మ ఆలయ పునరుద్ధరణ

ప్రాజెక్టుల చరిత్ర గుర్తు చేసిన జగ్గారెడ్డి

హైదరాబాద్ మహానగర ప్రజలకు సింగూరు, మంజీరా ద్యామ్ ద్వారా తాగునీరు అందుతుందని జగ్గారెడ్డి తెలిపారు. సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదని దెప్పగలరా అంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన (Jaggareddy) నిలచేశారు. 2014లో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పూర్తి చేయాలని.. నాటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కోరితే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులు నిర్మించాలని ఈ పదేళ్లలో మీకు గుర్తు రాలేదా? అంటూ హరీశ్ రావును జగ్గారెడ్డి ప్రశ్నించారు. జగన్.. కేసీఆర్ ఎందుకు కూర్చున్నారు? జగన్లో కెసిఆర్, కేటీఆర్ ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టలేదా..? మీరు మాట్లాడితే తప్పు లేదు. రేవంత్ మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్.. టీడిపీలో డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యాడు. ఆంధ్రోళ్ల దోపిడీ గురించి అప్పుడూ ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు.

హరీశ్ రావుపై వ్యక్తిగతంగా విమర్శలు

పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా హరేష్ చెప్పినవి అన్ని దొంగ లెక్కలు.. దొంగ మాటలు నీకు నీ మామ కి చంద్రబాబు పదవి ఇవ్వక పోయే సరికి తెలంగాణ గుర్తుకు వచ్చింది అని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాలతో ఉపయోగం లేదని అసెంబ్లీ లో కేసీఆర్ చెప్పలేదా.. ? కేసీఆర్ సభలో మాట్లాడిన వీడియో బయట పెట్టాలి అని పేర్కొన్నారు. మీ మామ తోలు తీస్తా అనకపోతే రేవంత్ రెడ్డి తిట్టే వాడా..? మీరెందుకు తిడుతున్నారు చెప్పండి నువ్వు తోలు తీస్తా అంటే నేను నాలుక కోస్తా అన్నాడు అనుకపోతే ఎట్లా…? అని ప్రశ్నించారు. తిడితే తిట్టరా..? రేవంత్ కాబట్టి నాలుక కోస్తా అన్నాడు నేను ఉంటే ఇంకా ఏదో అనే వాణ్ణి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమక్కుమారెడ్డిల ఇరిగేషన్ ప్రజెంటేషన్ కరెక్ట్, పారిశ్రావు ప్రజెంటేషన్ బోగస్, మీరు అధికారంలో ఉంటే ఆంధ్రోళ్ల నీళ్ల దోపిడి గుర్తుకు రాదు, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఆంధ్రోళ్ల దోపిడి గుర్తుకు వస్తదని వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


Andhra Pradesh Water Dispute brs harish rao Irrigation Controversy jaggareddy Latest News in Telugu Telangana politics Telangana Sentiment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.