📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Irrigation : నీటిపారుదలలో పూర్తిస్థాయి సంస్కరణలు – మంత్రి ఉత్తమ్

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : నీటిపారుదల శాఖా సెంట్రల్ డిజైన్ (Irrigation Department Central Design) విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రత సంస్థతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సి.డి.ఓ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వ్యాఖ్యాలపై సి.డి.ఓ పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సి.డి.ఓను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముక్యంగా ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకరావాలన్నారు.

అందుకు అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్వేరను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర మోలిక సదుపాయాలకల్పనలో ముందుండాలన్నారు. సమయంలో సి.డి.ఓ లో ఖాళీగా ఉన్న ఉద్యగాల భర్తీకి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు అన్నీ స్థాయిలలో ఉద్యగాల భర్తీ చేపట్టడం సంస్థను బలోపేతం చేయడంలో బాగామేనన్నారు. ఐ.ఐ.టిలు, ఎన్.ఐటిలవంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజినీర్లను సి.డి.ఓ లో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు (Project structures) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి కావడంతో ప్రతిభావంతులైన ఇంజినీర్ల సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీరింగ్, సృజనాత్మక అవసరమని అది అత్యుత్తమ శిక్షణ పొందిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. అటువంటి నిష్ణాతులైన ఇంజినీర్లను వినియోగిస్తూ అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలన్నారు. పదవీ విరమణ పొందిన అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వారి సేవలు కుడా వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టలని అన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/we-will-increase-the-pension-of-the-disabled-to-six-thousand/telangana/529780/

Breaking News in Telugu Google news irrigation news irrigation reforms Latest News in Telugu Telangana Irrigation uttam kumar reddy water resources

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.