Iran missile attack: పశ్చిమాసియాలో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య చెలరేగిన యుద్ధ జ్వాలలు ఒక తెలుగు వ్యక్తిని బలిగొన్నాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన రవిగోపాల్ అనే యువకుడు సౌదీ అరేబియాలో జరిగిన క్షిపణి దాడిలో మరణించినట్లు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. మార్చి 18వ తేదీ రాత్రి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను సౌదీ రక్షణ వ్యవస్థలు గాలిలోనే కూల్చివేసినప్పటికీ, వాటి శకలాలు రవిగోపాల్ పనిచేస్తున్న ఆయిల్ రిఫైనరీ సమీపంలో పడటంతో ఈ ప్రమాదం సంభవించింది.
Read Also : VC Sajjanar: సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్త
యుద్ధ జ్వాలలకు తెలంగాణ వ్యక్తి బలి
సౌదీ రాజధాని రియాద్లోని కీలక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు క్షిపణులను ప్రయోగించింది. వీటిని గగనతలంలోనే అడ్డుకున్నప్పటికీ, కూలిపోయిన క్షిపణి ముక్కలు కింద ఉన్న రిఫైనరీ ప్రాంతంలో పడ్డాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న రవిగోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికారి అసీమ్ మహాజన్ సూచించారు.
పుట్టెడు దుఃఖంలో కుటుంబం
రవిగోపాల్ మృతి వార్త మహబూబాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో పెను విషాదాన్ని నింపింది. మరణించడానికి కొద్ది నిమిషాల ముందే ఆయన తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. రవికి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి దూరం కావడంతో ఆ కుటుంబం అనాథగా మారింది. రవి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వం తమకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా వేడుకుంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :