తెలంగాణ (TG) రాష్ట్రం మరోసారి దేశంలో ప్రాధాన్యత సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలో, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం (Inland Fisheries Export Hub) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రం స్థాపనతో రాష్ట్ర మత్స్య పరిశ్రమలో కొత్త అవకాశాలు, పెద్ద స్థాయి ఉపాధి అవకాశాలు, ఎగుమతి వృద్ధి వంటి అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Read Also: Vegetable Prices : కొండెక్కిన కూరగాయల ధరలు

హైదరాబాద్ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రూ.47 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ కేంద్రం నిర్మాణం హైదరాబాద్ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా కొహెడలో జరగనుంది. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ముఖ్యంగా, చెన్నైకి చెందిన ‘కులు కన్సల్టెన్సీ సంస్థ’ ద్వారా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (Detailed Project Report) సిద్ధం చేయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: