Telangana : తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు

Read Time:  1 min
Inter results on 22nd of this month in Telangana
Inter results on 22nd of this month in Telangana
FONT SIZE
GET APP

Telangana : ఈ నెల 22న ఇంటర్‌ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం (ఏప్రిల్‌ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో చూసుకోవచ్చు. మొదటి సంవత్సరం, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్

డిప్యూటీ సీఎం భట్టి ఫలితాలను విడుదల చేస్తారు.

నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీ ఇంటర్‌ ఫలితాలు ఈ నెల 12న విడుదలైన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు

కాగ, తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 6, 2025 నుండి మార్చి 25, 2025 వరకు జరిగాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు జరిగాయి. రాష్ట్రంలో సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 5,08,253 మంది ఉన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో జరిగాయి. మూల్యాంకనం పూర్తయ్యింది. ఫలితాల విడుదల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: సన్నబియ్యం పథకం గ్రాండ్ సక్సెస్

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.