తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ, లబ్ధిదారులు ఇసుక కొరతతో తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రకటించినప్పటికీ, పలు ప్రాంతాల్లో అది అమలు కావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట (suryapet) జిల్లాలో ఇసుక సరఫరా వ్యవస్థ అంతరాయం పడడంతో ఇంటి నిర్మాణ పనులు నిలకడగా సాగడం లేదు.
Read also: Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!
Sand troubles for Indiramma House beneficiaries
ఇసుక ధరలు రూ. 6,500 నుంచి రూ. 10,000 వరకు
ఇసుక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ బుకింగ్, రీచ్లు ఆశించిన విధంగా పనిచేయకపోవడంతో లబ్ధిదారులు ప్రైవేట్ వ్యాపారులవైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టర్ ఇసుక ధరలు రూ. 6,500 నుంచి రూ. 10,000 వరకు పెరిగిపోయాయి. లబ్ధిదారులు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక ఇల్లు నిర్మాణానికి అవసరమైన ఇసుక కోసం కనీసం ఎనిమిది ట్రిప్పులు అవసరం. ఈ పరిస్థితిలో ఉచిత ఇసుక ప్రయోజనం అందకపోవడంతో అదనపు భారం వారిపై పడుతోంది.
ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించడంతో
జిల్లాలో ఇప్పటివరకు 8,112 మందికి ఇందిరమ్మ ప్రొసీడింగులు జారీ కాగా, వారిలో పెద్దఎత్తున లబ్ధిదారులు ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించడంతో ఇసుక డిమాండ్ పెరిగింది. అధికారులు ప్రతి మండలానికి ప్రత్యేకంగా ఒక రీచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా, ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతానికి జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, నాగారం, టేకుమట్ల ప్రాంతాల నుంచి మాత్రమే ఇసుక వస్తోంది. అయితే ఈ ఇసుక పునాదులకు సరిపోతుందిగానీ గోడల నిర్మాణానికి పనికిరాదని పలువురు లబ్ధిదారులు వివరిస్తున్నారు.
అదనంగా, ‘మన ఇసుక మన వాహనం’ యాప్ ద్వారా బుకింగ్ చేసినా, ఇసుక సరఫరాలో జాప్యం జరుగుతోందని, రవాణా ఛార్జీలు పారదర్శకంగా లేవని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవస్థ లోపాలే అధిక ధరలు, అక్రమ రవాణాకు దారితీస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: