Indiramma Indlu Update 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పల్లెల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగింది. ఇప్పుడు ప్రభుత్వం పట్టణాల్లోనూ ఇదే పథకాన్ని అమలు చేయడానికి (Indiramma Indlu Update 2025) ముందుకొచ్చింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో (GO 69) జారీ చేసింది.
పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu Update 2025)
ఇకపై పట్టణాల్లో నివసించే పేద కుటుంబాలు కూడా తమ సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం పొందబోతున్నారు. పల్లెల్లో ఈ పథకం పెద్ద విజయం సాధించడంతో, ఇప్పుడు పట్టణాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ – “ఇరుకు ప్రాంతాల్లో ఉన్న పేదలకు కూడా ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఇస్తున్నాం” అని తెలిపారు.

Read Also: Kurnool Bus Tragedy:బస్సు ప్రమాదానికి కారణాలు తెలిపిన రవాణా శాఖ
ఇంటి విస్తీర్ణం & నిర్మాణ వివరాలు
పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. అంటే సుమారు 400 చదరపు అడుగుల ఇల్లు (G+1 తరహాలో) కట్టుకోవచ్చు.
గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు, ఫస్ట్ ఫ్లోర్లో మరో 200 చదరపు అడుగులు ఉండేలా డిజైన్ చేయవచ్చు. ఇది పెద్ద కుటుంబాలకు సౌకర్యంగా ఉంటుంది.
నిర్మాణ నిబంధనలు (Indiramma Indlu Update 2025)
ప్రభుత్వం కొన్ని కండీషన్లు కూడా పెట్టింది.
- కనీసం 96 చదరపు అడుగుల గది
- మరో 70 చదరపు అడుగుల గది
- వంటగది కనీసం 35.5 చదరపు అడుగులు ఉండాలి.
అలాగే, బాత్రూమ్, టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి.
ఇల్లు RCC స్లాబ్తోనే నిర్మించాలి.
ఇంటి ప్లాన్ సిద్ధం చేసిన తర్వాత, సమీప హౌసింగ్ డీఈఈ అధికారి అనుమతి తీసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాతే నిర్మాణం ప్రారంభించాలి.

మనీ పంపిణీ విధానం
ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షలు అందిస్తారు. ఈ మొత్తం దశలవారీగా విడుదల అవుతుంది:
ఇంటి రూఫ్ లెవల్ వరకు నిర్మిస్తే – ₹1 లక్ష
గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయితే – ₹1 లక్ష
ఫస్ట్ ఫ్లోర్ కాలమ్స్, స్లాబ్ పూర్తయితే – ₹2 లక్షలు
మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత – ₹1 లక్ష
ఇలా మొత్తం రూ.5 లక్షలు దశలవారీగా అందిస్తారు.
అర్హతలు (Indiramma Indlu Update 2025)
- సొంత స్థలం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రభుత్వం స్థలం ఇవ్వదు; మనీ మాత్రమే ఇస్తుంది.
- ప్రస్తుతానికి షెడ్ల్లో లేదా అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలు ఈ పథకానికి అర్హులు.
స్థలం లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తర్వాత దశలో వారికి కూడా ఇళ్లు అందించే ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

పల్లెల్లో ఇప్పటికే వేలాది ఇళ్లు పూర్తవగా, ఇప్పుడు పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త ఊపుతో ప్రారంభమవుతోంది.
సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలు వెంటనే అధికారులను సంప్రదించి, తమ ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :