ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకలో – వికారాబాద్ జిల్లాలో లబ్ధిదారుల నిరాశ
వికారాబాద్, అక్టోబర్ 13 :
Indiramma-illu : ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ప్రజల్లో తీవ్ర ఆవేదనకు కారణమవుతోంది. పైలెట్ ప్రాజెక్టు పేరిట ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని (Indiramma-illu) ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తవకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, నిజానికి కేవలం పత్రాలపైనే పథకం ముందుకెళ్తోంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా, నిర్మాణం మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే నిలిచిపోయింది.

ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కూడా ఇప్పటివరకు చాలామందికి అందలేదు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసినప్పుడే సాయం అందిస్తామన్న నిబంధన వల్ల లబ్ధిదారులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తమ పాత ఇళ్లు కూల్చి కొత్త ఇళ్ల కోసం వేచి ఉన్నా, సాయం అందక అవస్థలు పడుతున్నారు.
Read also : డోన్-గుంటూరు రైలును గుంతకల్లు -విజయవాడ మధ్య నడపాలి
జిల్లాలో పరిస్థితి ఇలా ఉంది:
- వికారాబాద్ జిల్లాకు మంజూరైన ఇళ్లు – 11,785
- మార్కింగ్ పూర్తి అయినవి – 5,708
- పునాది వరకు పూర్తయినవి – 628
- ఆర్థిక సాయం పొందిన వారు – 573 మంది మాత్రమే
- గోడల వరకు పూర్తయినవి – 69 ఇళ్లు
- స్లాబ్ వరకు పూర్తయినవి – 25 ఇళ్లు
- 53 మందికి రూ.2 లక్షలు, 20 మందికి రూ.4 లక్షల వరకు సాయం అందజేశారు.
ప్రజల అసంతృప్తి పెరుగుతోంది:
ప్రభుత్వం అరకొర సాయం, ఆలస్యం, కాగితపనుల్లో ఇరుక్కుపోయిన పథకం వల్ల లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డుల విషయంలోనూ విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ పేదల కలలపై నీళ్లు పోసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు “అర్హులందరికీ సాయం అందుతుంది” అంటూ ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి కొద్దిమందికే సహాయం అందింది. మిగతావారు మాత్రం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ కష్టాల్లో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :