డోర్నకల్-పాపటపల్లి రైలు మార్గంలో మూడో లైన్ మరమ్మతుల కారణంగా రైల్వే ప్రయాణికులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రైల్వే track కు నిర్వహణ, మరమ్మతులు చేయడం కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు (South Central Railway Officials) ప్రకటించారు.
Inndaramma illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలో అదనంగా రూ.లక్ష జమ
ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఏకంగా 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ మార్పులు నేటి నుంచి 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.రద్దయిన రైళ్ల జాబితాలో పలు కీలక సర్వీసులు ఉన్నాయి. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్ప్రెస్తో పాటు డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు (Memo Passenger Trains) కూడా ఉన్నాయి.

రైళ్ల రద్దుతో పాటు కొన్ని ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. అదేవిధంగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ (Visakhapatnam-Secunderabad) మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా ప్రయాణిస్తాయని తెలిపారు.
పాక్షికంగా రద్దు
సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ (20629)లో కోచ్ మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేడు బయలుదేరనున్న ఈ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్ (AC Coach) లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, దాని స్థానంలో అదనంగా ఒక సెకండ్ ఏసీ కోచ్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: