📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు: సీఎం

Author Icon By sumalatha chinthakayala
Updated: February 15, 2025 • 8:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భవిష్యత్తుకు బాట‌లు వేసేలా ప‌ర్యాట‌క శాఖ‌ను తీర్చిదిద్దాలి..

హైదరాబాద్‌: రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా ప‌ర్యాట‌క శాఖ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప‌ర్యాట‌క శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని తెలిపారు. నాగార్జున సాగ‌ర్‌ బ్యాక్ వాట‌ర్‌లో బోట్ హౌస్‌ అందుబాటులో ఉంచాల‌ని, డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాల‌ని సీఎం సూచించారు.

ఆల‌యాలు, పులుల అభ‌యార‌ణ్యాల‌కు ప‌ర్యాట‌కంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంద‌ని, ఆ దిశ‌గా దృష్టిసారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. భ‌ద్రాచ‌లం, సలేశ్వరం, రామ‌ప్ప వంటి ఆల‌యాలు, మల్లెల తీర్ధం, బొగ‌త జ‌ల‌పాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆల‌యాలు ఇలా ప్రతీ ప‌ర్యాట‌క ప్రదేశంలో వ‌స‌తులు మెరుగుపరచడంతో పాటు స‌రైన ప్రచారం క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. భువ‌న‌గిరి కోట రోప్​వే ప‌నుల‌పై ఆరా తీశారు. భూ సేక‌ర‌ణ పూరయిందని త్వరలో టెండ‌ర్లు పిలుస్తామ‌ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. భువ‌న‌గిరి కోట రోప్‌వే ప‌నుల‌కు త్వరగా టెండ‌ర్లు పిల‌వ‌డంతో పాటు అక్కడి చారిత్రక కట్టడాల పరిరక్షణకు అవ‌స‌ర‌మైన చర్యలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

అట‌వీ, ఐటీ, విద్యుత్‌, టీజీఐఐసీ, వైద్య, క్రీడ‌ల శాఖ‌ల‌తో సమన్వయం చేసుకొని ప‌ర్యాట‌క శాఖ పాల‌సీకి తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక శాఖ విధానాలు మ‌రో శాఖ పాలసీలకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాహస క్రీడలకు ప‌ర్యాట‌క శాఖ‌లో ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. వైద్య అవ‌స‌రాల‌కు విదేశాల నుంచి వ‌చ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప‌ర్యాట‌కుల్లా వ‌చ్చిపోయేలా చర్యలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

Breaking News in Telugu CM Revanth Reddy Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online tourism sector

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.