📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా- కేసీఆర్

Author Icon By Sudheer
Updated: March 8, 2025 • 7:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తాను హాజరవుతానని, ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా అసత్య ప్రచారాలపై ఆధారపడిందని, అది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని విమర్శించారు.


ప్రజలు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గుర్తించారు

ప్రజలు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గుర్తించి, ఇప్పటికే విసుగుచెందారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్లు ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ హామీలలో ఎంత మేరకు నిజం ఉందో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తానని తేల్చి చెప్పారు.

ఏప్రిల్ 27న వరంగల్‌లో భారీ సభ

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కీలక ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీలను నిలదీస్తామని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ పార్టీలు ఎవరో ప్రజలకు బహిరంగంగా తెలియజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జరగనున్న ఈ సభ తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే విధంగా ఉంటుందని వివరించారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్

తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వంలో అందుకున్న అభివృద్ధి, సంక్షేమాన్ని తలచుకుంటే.. కాంగ్రెస్ పాలన ఎంత వెనుకబాటుగా ఉందో స్పష్టమవుతోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం దగ్గరపడిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి బలంగా రాబోతుందని అభిప్రాయపడ్డారు.

congress Google news KCR kcr assembly

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.