గతవారం రోజులుగా ఐబొమ్మ (I Bomma) నిర్వహకుడు ఇమ్మడి రవి గురించి మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఎంతో ఉన్నతమైన చదువు చదివి, టెక్నాలజీలో (Technology) అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన రవి, ఆ విద్యను పదిమందికి మేలుకరంగా ఉపయోగించాల్సింది పోయి, అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. అనుకున్నట్లుగానే కోట్లు సంపాదించాడు. దాన్ని అనుభవించకుండానే ఊచలు లెకపెడుతున్నాడు. ప్రస్తుతం పోలలీసులు కస్టడిలో ఉన్న రవి విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read Also: Donald Trump : భారత్-పాక్ విషయంలో ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
పైరసీ కేసులో ఐబొమ్మ
సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా బషీర్ బాగ్ లోని సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీస్ స్టేషన్ కు అతడిని తరలించారు. పైరసీ (piracy) వెబ్ సైట్లకు సంబంధించిన అన్ని కోణాల్లో అధికారులు రవిని ప్రశ్నిస్తున్నారు.
నాంపల్లి కోర్టు (Nampally) మొత్తం అయిదురోజుల పాటు రవిని విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 21వేల సినిమాలను పైరసీ చేసిన రవి ఇమ్మడి రవి దాదాపు 21వేల సినిమాలను పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గత ఆరేళ్లుగా అతడు కరేబియన్ దీవుల్లో ఉంటూ 66 మిర్రర్ వెబ్సైట్లలో పైరసీ సినిమాలు అప్ లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు దాదాపు 50లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరగాళ్లు, గేమింగ్, బెట్టింగ్ యాప్ ల నిర్వహకులకు అమ్మేసి వందలకోట్లలో డబ్బులు సంపాదించినట్లు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: