Telugu News: Accident-యువకుడి నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణం తీసింది

Read Time:  1 min
Telugu News: Accident-యువకుడి నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణం తీసింది
FONT SIZE
GET APP

Accident: హైదరాబాద్‌లోని లంగర్ హౌస్(Langar House) ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు, ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Accident

వినాయక నిమజ్జనంలో జరిగిన విషాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వినాయక నిమజ్జనం(Ganesh immersion) సందర్భంగా లంగర్‌హౌస్ దర్గా సమీపంలో ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన కారు బలంగా పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ప్రమాదంలో 20 ఏళ్ల కశ్వి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీస్ వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది?
ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ దర్గా సమీపంలో చోటుచేసుకుంది.

ప్రమాదానికి కారణం ఏమిటి?
కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉండటం, అలాగే అధిక వేగం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-ashoka-chakra-union-minister-giriraj-singh-criticizes-rahul-gandhi/national/542766/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.