NEW YEAR 2026: ఆల్కహాల్ రీడింగ్ చూసి పోలీసులు అవాక్కు

Read Time:  1 min
NEW YEAR 2026: ఆల్కహాల్ రీడింగ్ చూసి పోలీసులు అవాక్కు
FONT SIZE
GET APP

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం తాగి వాహనాలతో రోడ్ల పైకి వస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ముందే మాస్ వార్నింగ్ ఇచ్చారు. నగరంలోని వందకు పైగా ప్రాంతాల్లో డిసెంబర్ 31న రాత్రి ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని చెప్పారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని.. జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు.

Read Also: HYD: నూతన సంవత్సరం..కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్

పోలీసులు ఇంత గట్టిగా చెప్పినా.. కొందరు నగరవాసులు తీరు మార్చుకోలేదు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఫుల్లుగా తాగి వాహనాలతో రోడ్డెక్కారు. పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌ తనిఖీల్లో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో మందుబాబులు పట్టుబడ్డారు. ఈ సందర్బంగా, హైదరాబాద్‌లోని పంజగుట్టలో పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ టెస్టులో ఓ వ్యక్తికి దాదాపు 550 పర్సంటేజ్ వచ్చింది.

ఈ పర్సంటేజ్ అందరినీ షాక్‌కి గురిచేసింది. అందుకు సంబంధించిన రిసిప్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అంతలా ఏం తాగావ్ బ్రో అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. మరొకరేమో ఆ బైక్ పై ఎన్ని పెండింగ్ చలానాలు ఉన్నాయో చెక్ చేసి కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేశాడు. అతడి బైక్‌పై దాదాపు 11 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు ఓ రిసిప్ట్ పెట్టాడు. మొత్తానికి ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.