Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య

Read Time:  1 min
Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య
FONT SIZE
GET APP

Hyderabad : (ఎల్.బి.నగర్) : ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్ పోలీసుల ప్రకారం, 17 ఏళ్ల అరుంధతి సుక్కు ఇంటర్మీడియట్ బైపిసి మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బోటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో అరుంధతి తీవ్ర మనస్తాపానికి గురైంది.ఈ దుఃఖకర సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో జరిగింది. అరుంధతి తన ఇంట్లోని రాడుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే నాగోల్ సుప్రజ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. కానీ, ఆసుపత్రిలో వైద్యులు తన తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.అరుంధతి సోదరుడు సుక్కు గౌతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More : Terror Attack : ఈరోజు కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.