Hyderabad crime: పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి

Read Time:  1 min
Hyderabad crime: పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి
FONT SIZE
GET APP
Hyderabad crime: Boy dies after falling from building while searching for kite
Hyderabad crime: Boy dies after falling from building while searching for kite

Hyderabad crime: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పతంగి కోసం వెళ్తూ ప్రమాదవశాత్తూ భవనంపై నుండి కింద పడి ఓ పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Read also: Telangana: కీలక మావోయిస్టు నేత ప్రభాకర్ హతం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

మంచిర్యాల జిల్లా(Manchryala District)కు చెందిన మహేందర్, సుజాత దంపతులు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి సాయిబాబా నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు హేమంత్ (10) ఆదివారం ఆటలాడుకుంటూ భవనం పైకి వెళ్లాడు. అక్కడ పతంగిని పట్టుకునే క్రమంలో అదుపుతప్పి మేడపై నుండి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.