రాష్ట్రవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక కారణాలతో గ్యాస్ ఏజెన్సీ సర్వర్లు పనిచేయకపోవడంతో బుకింగ్ ప్రక్రియ స్తంభించిపోయింది. వినియోగదారులకు ఓటిపి రాకపోవడంతో డెలివరీ నిలిచిపోతోంది. టోల్ ఫ్రీ నంబర్లు కలవకపోవడం, ఏజెన్సీల దగ్గర ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది.
Read also: Shocking Crime News Hyderabad: పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్
Hyderabad: 24/7 Gas Woes! The Outcry of the Common Man—From Village to City!
బ్లాక్ మార్కెట్ లో భారీగా పెరిగిన ధరలు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చమురు సరఫరాకు ఆటంకం కలగడం బ్లాక్ మార్కెట్ వ్యాపారులకు వరంగా మారింది. సాధారణంగా లభించే సిలిండర్ ధరను అక్రమార్కులు ఆకాశానికి పెంచేశారు. గృహ అవసరాల గ్యాస్ రూ. 2 వేలకు, కమర్షియల్ సిలిండర్ ధర రూ. 5 వేల వరకు పలుకుతోంది. ఏజెన్సీల్లో స్టాక్ లేదని చెబుతున్నా, అక్రమ మార్గాల్లో మాత్రం సిలిండర్లు ప్రత్యక్షమవుతున్నాయి. దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైపోతోంది.
అధికారుల తనిఖీలు మరియు కఠిన చర్యలు
గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పందిస్తూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. అక్రమ నిల్వలను అరికట్టేందుకు ఐదు ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. వినియోగదారులు కేవలం అధికారిక మార్గాల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. సరఫరాను క్రమబద్ధీకరించి, త్వరలోనే గ్యాస్ కష్టాలను తీరుస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: