Telugu News: Bandi Sanjay: గో సంరక్షకుడి పై దాడి చేసిన నిందితులను శిక్షించాలి

Read Time:  1 min
Bandi Sanjay
Bandi Sanjay
FONT SIZE
GET APP

హైదరాబాద్ (కంటోన్మెంట్): గోవులను అక్రమంగా వధశాలలకు తరలిస్తుంటే అడ్డుకున్న బజరంగ్ దళ్ కార్యకర్త సోను సింగ్ అలియాస్ ప్రశాంత్‌పై దాడి జరగడం సరైంది కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం, ఐటీ కారిడార్ వద్ద జరిగిన ఈ ఘటనలో సోను సింగ్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన సోను సింగ్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

Read Also: Kurnool Tragedy: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి

రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై విమర్శలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. గోవులను పూజించడం భారతీయ సంస్కృతి అని, గోరక్షకుడిపై దాడి చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఇస్లామ్‌లో గోవులను వధ చేయాలని ఎక్కడైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీలకు వత్తాసు పలుకుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Bandi Sanjay

ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గో రక్షకులపై దాడులు జరిగితే కేసీఆర్‌కు పట్టిన గతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మజ్లిస్ ఆగడాలు పెరిగాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు.

కాల్పులకు గురైన గోరక్షకుడి పేరు ఏమిటి?

సోను సింగ్ అలియాస్ ప్రశాంత్.

గో రక్షకుడిపై ఎక్కడ దాడి జరిగింది?

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం, ఐటీ కారిడార్ వద్ద ఈ దాడి జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.