తెలంగాణలో ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండల తీవ్రత స్పష్టంగా పెరుగుతోంది. ఇటీవలి వరకు చలి గాలులు కొనసాగినా, ఇప్పుడు పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు 33 నుండి 34.3 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం స్వల్ప చలి ఉన్నా, మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలు (summer) ఎక్కువగా వేడెక్కుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత కనిపిస్తోంది. ఈ పరిస్థితులతో ప్రజలు ఇప్పటికే కూలర్లు, ఏసీలను వినియోగించడం ప్రారంభించారు.
Read also: AP: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
First rains in the state
అల్పపీడనం ప్రభావం, వర్షాల అంచనా
శ్రీలంక సమీప సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దాని ప్రభావంతో ఈ నెల 18 తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ వర్షాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించే అవకాశముంది. 2025-26 సీజన్లో వర్షాకాలం, చలికాలం ఎక్కువ ప్రభావం చూపిన నేపథ్యంలో, ఈసారి వేసవిలో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 1.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎండల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లని లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం శరీరానికి ఉపశమనం ఇస్తుంది. తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించవచ్చు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. సరైన ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా వేసవి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: