📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాద నిరసన ర్యాలీకి సిఎం రేవంత్, అసదుద్దీన్

Author Icon By Digital
Updated: April 26, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad : ఎఐసీసీ పిలుపుమేరకు శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని నిరసిస్తూ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన గట్టి ప్రతిస్పందనను గుర్తు చేస్తూ, అప్పట్లో ఆమె ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఆవిష్కరించారని గుర్తుచేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఉగ్రవాదంపై గట్టి జవాబు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత దేశంలో కలపాలని సూచించారు. పహల్గాంలో భారతీయ పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు.

Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాద నిరసన ర్యాలీకి రేవంత్, అసదుద్దీన్

Hyderabad : ఉగ్రవాదంపై గట్టి స్పందనతో దేశ భద్రతకే ప్రాధాన్యం: సీఎం రేవంత్

దేశం అంతటా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేందుకు రాజకీయాలు, పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అండగా నిలబడతామని ప్రకటించారు.ఈ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ విజయశాంతి, వీహెచ్, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, బల్మూరి వెంకట్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.

Read More : Chandrababu : మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు

Anti-Terror Protest Asaduddin Owaisi Breaking News in Telugu Candle Rally Congress Rally Google news Google News in Telugu hyderabad Indira Gandhi Latest News in Telugu POK Revanth Reddy Telangana politics Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Terrorism Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.