Hyderabad: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth reddy) తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుంచి కోటి దీపోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా, ఈ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
Read also: Jubilee Hills: జూబ్లీహిల్స్లో 144 సెక్షన్ అమలు

Hyderabad: కోటి దీపోత్సవానికి రాష్ట్ర పండుగ హోదా ప్రకటించిన రేవంత్రెడ్డి
తన పుట్టిన రోజున
Hyderabad: ఇటీవల ఇదే వేదికపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే జాతీయ గుర్తింపు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రేవంత్ గుర్తు చేశారు. తన పుట్టిన రోజున భక్తుల మధ్య ఇంత పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అల్జీపురం మఠాధిపతి శ్రీ వామనాశ్రమ స్వామి ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి దంపతులు, పలువురు స్వామీజీలు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: